బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజా భవన్ రోడ్డు ప్రమాదం తర్వాత కుమారుడితో కలిసి దేశం విడిచి వెళ్లిపోగా.. తాజాగా శంషాబాద్ ఎయిర్పోర్టులో అరెస్ట్ చేశారు. తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు రాగా.. అప్రమత్తమైన పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అంత్యక్రియల అనంతరం అతడిని విచారించే అవకాశం ఉంది.