2025 కేంద్ర బడ్జెట్లో ఏపీకి కేటాయింపులు జరిగాయి. కేంద్ర బడ్జెట్లో పోలవరం జాతీయ ప్రాజెక్టు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, విశాఖ పోర్టుకు నిధులు కేటాయించారు. అలాగే జల్ జీవన్ మిషన్ 2028 వరకూ పొడిగించారు. మరోవైపు బడ్జెట్ కేటాయింపుల నేపథ్యంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ధన్యవాదాలు తెలియజేశారు. బడ్జెట్లో సింహభాగం ఏపీకి దక్కుతుందని.. ఆంధ్రప్రదేశ్కు ఉపయోగపడేలా బడ్జెట్లో అనేక నిర్ణయాలు ఉన్నాయని రామ్మోహన్ నాయుడు వివరించారు.