YS Sharmila Demands Caste Census in AP: తెలంగాణలో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిన అంశం కులగణన. అయితే ఇప్పుడు ఏపీలోనూ కులగణన చేయాలనే డిమాండ్లు మొదలయ్యాయి. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చారు. తెలంగాణ తరహాలోనే ఏపీలోనూ పరిస్థితులు ఉన్నాయన్న షర్మిల.. అక్కడి మాదిరిగానే కులగణన చేపట్టాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును డిమాండ్ చేశారు. ఐదున్నర కోట్ల మందిలో వెనుకబడిన వర్గాల వారు ఎంతమంది ఉన్నారనే లెక్కలు తేలాలని.. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయించాలని షర్మిల డిమాండ్ చేశారు.