Telangana Samagra Kutumba Survey: తెలంగాణలో మరోసారి కులగణన సర్వే నిర్వహించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది. తెలంగాణ సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే పేరుతో రేవంత్ రెడ్డి సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణన సర్వేలో చాలా మంది పాల్గొనకపోవటంతో.. వారికి మరో అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు.. ఫిబ్రవరి 16 నుంచి 18 మధ్య మరోసారి కులగణన సర్వే నిర్వహించనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు.