Chadrababu: తిరుమల లడ్డూ వివాదంపై చంద్రబాబు ప్రెస్ మీట్.. సీఎం సంచలన వ్యాఖ్యలు

1 year ago 31
తిరుపతి లడ్డూ వ్యవహారం విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి వైఎస్ జగన్ మీద విమర్శలు గుప్పించారు. ఆదివారం తన నివాసంలో విలేకర్ల సమావేశం నిర్వహించిన చంద్రబాబు.. తిరుమల విషయంలో వైసీపీ ప్రభుత్వం అనుసరించిన విధానాల మీద మండిపడ్డారు. తిరుమలను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చివేశారని ఆరోపించారు. గత ముఖ్యమంత్రులు ఎవరూ చేయని రీతిలో తిరుమలను అపవిత్రం చేశారన్న చంద్రబాబు.. చివరకు కోట్లాది మంది హిందువులు పవిత్రంగా భావించే లడ్డూ విషయంలోను దారుణంగా వ్యవహరించారన్నారు. ఇంతా చేసి ప్రాయశ్చిత్త పడకుండా.. తిరిగి ప్రశ్నిస్తున్నారంటూ మండిపడ్డారు.
Read Entire Article