Chandrababu: ఆంధ్రప్రదేశ్లో ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభవార్త అందించారు. ప్రస్తుతం చాలా మంది ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం చేస్తుండగా.. వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లాల వారీగా వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఈ క్రమంలోనే వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని మరింత ప్రోత్సహిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.