కడప మహానాడు సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడప జిల్లాకు వరాలు ప్రకటించారు. రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులు జూన్ 12లోగా ప్రారంభిస్తామని, గాలేరు నగరి ప్రాజెక్టును కడప వరకు తీసుకువస్తామని హామీ ఇచ్చారు. రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని, కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని, పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ రాష్ట్రాన్ని గ్లోబల్ హబ్గా తీర్చిదిద్దుతామని చంద్రబాబు పేర్కొన్నారు.