Chandrababu: రేపే శ్రీసిటీ పర్యటనకు చంద్రబాబు.. ఒకే రోజు 15 పరిశ్రమలు ప్రారంభం.. కంపెనీల లిస్ట్ ఇదే..

1 year ago 23
ఏపీ సీఎం చంద్రబాబు రేపు తిరుపతి జిల్లా శ్రీసిటీలో పర్యటించనున్నారు. శ్రీసిటీ పర్యటనలో చంద్రబాబు నాయుడు 15 పరిశ్రమల కార్యకలాపాలను ప్రారంభిస్తారు. అలాగే మరికొన్ని సంస్థలకు శంకుస్థాపనలు చేయనున్నారు. వీటితో పాటుగా పలు దేశ,విదేశీ సంస్థలతో ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు కుదుర్చోనుంది. శ్రీసిటీ పర్యటనలో భాగంగా సంస్థల సీఈవోలతోనూ చంద్రబాబు భేటీ అవుతారు. ఈ పర్యటన పూరైన తర్వాత నెల్లూరు జిల్లాకు వెళ్లనున్న సీఎం చంద్రబాబు.. సోమశిల ప్రాజెక్టును పరిశీలిస్తారు.
Read Entire Article