ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన రైతు ఆశీర్వాద సభ సందర్భంగా ఆసక్తికర దృశ్యాలు చోటుచేసుకున్నాయి. ఏపీ మాజీ సీఎం ఫోటోను రేవంత్ ఫ్లెక్సీలో పెట్టారు. అటు టీడీపీ నాయకుల కూడా ఎన్టీఆర్ ఫోటోతో రేవంత్కు స్వాగత ఫ్లెక్సీ ఏర్పాటుచేయడం గమనార్హం. ఇక, రైతు ఆశీర్వాద సభలో సీఎం రేవంత్ చివరి విడత రైతు భరోసా నిధులను విడుదల చేశారు. ఇదే సమయంలో పలువురికి ఈ- పట్టాదారు పాస్ పుస్తకాలను ఆయన అందజేశారు.