భారత్, పాకిస్థాన్ కాల్పుల విరమణ నేపథ్యంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ బీజేపీపై విమర్శలు గుప్పించారు. పాకిస్థాన్తో శాంతియుత పరిష్కారం కోరినందుకు తనను పాకిస్థాన్ పంపమన్న బీజేపీ నేతలు, ఇప్పుడు మోదీని పంపిస్తారా అని ప్రశ్నించారు. ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకోవాలని నారాయణ అన్నారు. అయితే గతంలో నారాయణ వ్యాఖ్యలపై సోము వీర్రాజు తీవ్రంగా స్పందించారు, నారాయణ పాకిస్థాన్ వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు.