డ్వాక్రా మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డ్వాక్రా సంఘాలలోని మహిళలను డిజిటల్ లక్ష్మిలుగా నియమించే ఆలోచన చేస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసే సమయంలో మధ్యవర్తుల ప్రమేయాన్ని నివారించడం కోసం డిగ్రీ , ఆపై చదువులు చదివిన డ్వాక్రా సంఘాల్లో ఉన్న మహిళలను డిజిటల్ లక్ష్మి పేరుతో ఎంపిక చేసి వారితో ఈ సేవలు అందించే ఆలోచన చేస్తోంది. ఇప్పటికే కొన్ని జిల్లాలలో ఇందుకోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.