తినే ఏ వస్తువును వదిలిపెట్టడం లేదు కేటుగాళ్లు. పిల్లలు తాగే పాల దగ్గర నుంచి.. తినే బియ్యం వరకు కూడా కల్తీ చేస్తూనే ఉన్నారు. తాజాగా వంటలో వాడే నూనెను కూడా కల్తీ చేస్తూ సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులలకు దొరికిపాయారు మాయగాళ్లు. ఈ ఘటన హైదరాబాద్ మహబూబ్ మాన్షన్గా పిలువబడే మలక్పేట గంజ్ మార్కెట్లో చోటు చేసుకుంది. నాసిరకం వంట ప్యాకెట్లకు కంపెనీ లేబుళ్లతో నాణ్యమైన వంట నూనెగా విక్రయాలు సాగిస్తున్నారు. ఈ అక్రమ దందా చేస్తున్న వారిపై పోలీసులు దాడులు నిర్వహించారు.