ఏలూరులో దారుణం జరిగింది. ఎమ్ఆర్ఐ స్కానింగ్ కోసం వచ్చిన మహిళ డయాగ్నోస్టిక్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోయింది. సదరు మహిళకు గతంలోనే పేస్ మేకర్ అమర్చారు. అయితే డయాగ్నోస్టిక్ సిబ్బంది మెటల్ డిటెక్టర్తో తనిఖీ చేయకుండానే స్కానింగ్ నిర్వహించారు. దీంతో ఎమ్ఆర్ఐ స్కానింగ్ రేడియేషన్ కారణంగా పేస్ మేకర్ ఊడిపోయి మహిళ చనిపోయినట్లు తెలిసింది. దీంతో కుటుంబసభ్యులు డయాగ్నోస్టిక్ కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణం పోయిందని ఆరోపిస్తున్నారు.