ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు తీపికబురు వినిపించింది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేసే గెస్ట్ లెక్చరర్లకు భారీగా వేతనాలు పెంచింది. గెస్ట్ లెక్చరర్లకు ఇప్పటి వరకూ గంటకు 100 రూపాయలు చొప్పున గరిష్ఠంగా నెలకు రూ.10000 జీతంగా అందించేవారు. అయితే ఈ మొత్తాన్ని పెంచాలని గత కొన్నేళ్లుగా వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గంటకు రూ.375 చొప్పున నెలకు గరిష్ఠంగా రూ.27 వేలు చొప్పున గెస్ట్ లెక్చరర్లకు జీతం అందించాలని ఏపీ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.