ఎన్నికల హామీల అమల్లో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అమలవుతున్న పథకాలను అధ్యయనం చేసిన మంత్రుల కమిటీ, రెండు నెలల్లో ఈ పథకాన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటోంది. దీని ద్వారా రోజుకు 25 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరనుంది. మరోవైపు టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో రెండు నెలల్లోగా ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.