ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం సెప్టెంబర్ 6, 2025న అనంత చతుర్దశి రోజున జరగనుంది. ఈ సంవత్సరం ఖైరతాబాద్ గణపతిని శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా 69 అడుగుల ఎత్తులో ప్రతిష్టించారు. నిమజ్జనం రోజున ఎటువంటి అవాంతరాలు లేకుండా చూసేందుకు పోలీసులు , ఇతర ప్రభుత్వ శాఖలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి. లక్షలాది మంది భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొని.. గణేశుడిని దర్శించుకుంటారు. నేడు ఆదివారం కావడంతో ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి తండోపతండాలుగా భక్తులు తరలివచ్చారు.