తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు మొదలయ్యాయి. మార్చి మధ్య నుంచే సూరీడు సుర్రుమనిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక హెచ్చరికలు చేసింది. సోమవారం రాష్ట్రంలోని 35 మండలాల్లో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తీవ్రవడగాల్పులు వీచే మండలాలు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలలో ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.