హైదరాబాద్లో సొంతిల్లు కట్టుకోవాలనుకునే వారికి గుడ్న్యూస్. హెచ్ఎండీఏ మరోసారి భారీగా ప్లాట్లను విక్రయించనుంది. శివారు ప్రాంతాల్లో అభివృద్ధి చేసిన 2,570 ప్లాట్లను ఈ-వేలం ద్వారా విక్రయించేందుకు హెచ్ఎండీఏ అధికారులు సిద్ధమవుతున్నారు. కోకాపేట, బుద్వేల్తో సహా 10 ప్రాంతాల్లోని ఈ ప్లాట్ల ద్వారా రూ.4 వేల కోట్లకు పైగా ఆదాయం అంచనా. ప్రభుత్వం ఆమోదం తెలపగానే, విడతలవారీగా వేలం ప్రారంభమవుతుంది.