తెలంగాణలో గణేష్ నిమజ్జనం సందర్భంగా సెప్టెంబర్ 6వ తేదీన సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం ప్రకటించింది. దీనికి బదులుగా వచ్చే నెలలో అక్టోబర్ 11న రెండో శనివారం వర్కింగ్ డేగా ప్రకటించింది. ఇక బడా గణేష్ నిమజ్జనాన్ని చూడటానికి హైదరాబాద్ నుంచే కాకుండా.. ఇతర ప్రాంతాల నుంచి కూడా జనాలు వస్తారు. అలాంటి వారి కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేసింది. వివిధ డిపోల నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది ఆర్టీసీ.