హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో తెలంగాణ ప్రభుత్వం మరోసారి భారీ భూముల వేలానికి సిద్ధమైంది. రాయదుర్గం, గచ్చిబౌలిలో 18.67 ఎకరాల ప్రభుత్వ భూమిని టీజీఐఐసీ ద్వారా వేలం వేయనున్నారు. ఎకరాకు రూ.101 కోట్ల ప్రారంభ ధరతో అక్టోబర్ 6న ఈ-వేలం జరుగుతుంది. ఈ వేలం ద్వారా రూ.2 వేల కోట్లకు పైగా ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.