హైదరాబాద్లో పెరుగుతున్న అగ్ని ప్రమాదాలపై హైడ్రా దృష్టి సారించింది. వ్యాపారుల నిర్లక్ష్యం, సెల్లార్ల దుర్వినియోగంపై కమిషనర్ ఏవీ రంగనాథ్ తీవ్రంగా స్పందించారు. నిబంధనలు పాటించని భవనాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయాలని, సెల్లార్లను పార్కింగ్కు మాత్రమే పరిమితం చేయాలని ఆదేశించారు. ప్రజలు కూడా అగ్ని ప్రమాద ముప్పు పొంచి ఉన్న ప్రాంతాలను గుర్తించి సమాచారం అందించాలని కోరారు.