హైదరాబాద్లోని మల్కాజిగిరిలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేరేడ్మెట్ రైల్వే స్టేషన్ వద్ద రూ.80.47 కోట్లతో ఆర్యూబీ, ఎల్హెచ్ఎస్ నిర్మాణం చేపట్టనుంది. దీంతో రైల్వే క్రాసింగ్ల వద్ద గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం తప్పనుండటంతో.. ప్రయాణికులకు ఊరట లభించనుంది. ఈ ప్రాజెక్టులు మల్కాజిగిరి ప్రజల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చనున్నాయి. త్వరలోనే వీటి నిర్మాణం పూర్తి చేసి ప్రజల కోసం అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు ప్రకటించారు.