హైదరాబాద్లో రాజీవ్ స్వగృహ, హౌసింగ్ బోర్డు స్థలాల వేలానికి రేవంత్ సర్కార్ సిద్ధమైంది. అందులో భాగంగా.. ఎస్సాఆర్ నగర్ కమ్యూనిటీ హాల్ను అమ్మకానికి పెట్టాలని డిసైడ్ అయింది. ఈ నిర్ణయంపై స్థానికులు మండిపడుతున్నారు. పేద, మధ్యతరగతి వారికి ఉపయోగపడే కమ్యూనిటీ హాల్ను విక్రయించటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే హాల్ నిర్మాణం 90 శాతం పూర్తయిందని.. సర్కార్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.