హైదరాబాద్ ఐటీ ఉద్యోగులకు TGSRTC గుడ్న్యూస్ చెప్పింది. ఐటీ కారిడార్కు ప్రత్యేకంగా బస్సులు నడుపుతున్నట్లు వెల్లడించింది. ఇటీవల ఆరు గ్రీన్ మెట్రో లగ్జరీ బస్సులు నడుపుతుండగా.. తాజాగా మరో రెండు బస్సులను నేడు ప్రారంభించింది. ఐటీ ఉద్యోగులు సమ్మర్లో ఎలాంటి టెన్షన్ లేకుండా హాయిగా ఏసీలో ప్రయాణించే అవకాశం కల్పించినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.