హైదరాబాద్ జలమండలి తన తాగునీటి సరఫరా పరిధిని విస్తరిస్తోంది. ఇకపై ఔటర్ రింగ్రోడ్డు వెలుపల ఉన్న ప్రాంతాలకూ నీటిని అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. రియల్ ఎస్టేట్ అభివృద్ధి, రీజినల్ రింగ్రోడ్డు విస్తరణ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. శంషాబాద్, ఘట్కేసర్ సమీపంలోని శివారు గ్రామాల ప్రజలకు సైతం తాగునీరు అందనుంది. ఈ మేరకు అధికారులు చర్యలు చేపట్టారు.