హైదరాబాద్లో ముగ్గురు అక్కాచెల్లెళ్లు కనిపించకుండా పోవడం తీవ్ర సంచలనం రేపిన సంగతి తెలిసిందే. నగరంలో అదృశ్యమైన ఆ ముగ్గురు బాలికలు.. ఏలూరులో ప్రత్యక్ష్యం అయ్యారు. ఫోన్ ఎక్కువగా వాడుతున్నారని ఆ ముగ్గురిని.. వారి తల్లి మందలించడంతో ఇంటి నుంచి వెళ్లిపోయారు. దీంతో వారి ఆచూకీ కోసం వారి తల్లి పోలీసులను ఆశ్రయించగా.. గాలింపు చేపట్టి.. వారు ఏలూరులో ఉన్నట్లు గుర్తించి.. తిరిగి తల్లిదండ్రులను అప్పగించారు.