గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గత 11 నెలల్లో 16 మంది మహిళలు వరకట్న వేధింపుల కారణంగా ప్రాణాలు కోల్పోవడం సభ్య సమాజాన్ని కలవరపెడుతోంది. విద్యావంతులు, ఉన్నత ఉద్యోగులు ఉన్న నగరంలోనూ ఈ వికృత ఆచారం ఇంకా కొనసాగుతుండటం శోచనీయం. కట్టుకున్న వాడే కంటికి రెప్పలా చూసుకుంటాడని నమ్మిన వధువులకు.. అదనపు కట్నం పేరిట అత్తారింట్లో నరకం కనిపిస్తోంది. పెళ్లైన ఏడాదిలోపే చాలా మంది బలవుతుండటం వేధింపుల తీవ్రతను చూపుతోంది. కేవలం చట్టాలే కాకుండా.. సమాజంలో మార్పు వచ్చినప్పుడే ఇలాంటి అమానవీయ ఘటనలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంది.