హైదరాబాద్ కుషాయిగూడలో దారుణం ఘటన చోటు చేసుకుంది. కన్న తండ్రిని ఓ కుమారుడు కిరాతకంగా హత్య చేశాడు. పట్టపగలు అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై కత్తితో విచక్షణారహితంగా పొడిచి హతమార్చాడు. హత్య జరిగే సమయంలో చాలా మంది అక్కడే ఉన్నా.. వేడుక చూశారే తప్ప అతడ్ని రక్షించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. కుటుంబ కలహాల కారణంగానే హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.