హైదరాబాద్ జిల్లాలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ వేగంగా జరుగుతోందని పౌరసరఫరాల శాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటికే 78,294 కార్డులు జారీ చేయగా.. మరో 85 వేల దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయన్నారు. సెప్టెంబర్ నుండి కొత్త కార్డుదారులకు రేషన్ బియ్యం, సరుకులు అందుతాయని చెప్పారు. లబ్ధిదారులకు ప్రత్యేక సంచులను కూడా ప్రభుత్వం పంపిణీ చేయనుందని తెలిపారు.