చేస్తున్న ఉద్యోగం పట్ల సంతృప్తి లేక ఓ యువకుడు కఠిన నిర్ణయం తీసుకున్నాడు. హీలియం గ్యాస్ పీల్చి బలవన్మరణానికి పాల్పడ్డాడు. హైదరాబాద్ గచ్చిబౌలి పీఎస్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడు నిజామాబాద్కు చెందిన 28 ఏళ్ల నిర్మల సురేష్రెడ్డిగా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.