హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు. నగరంలో మరో హైటెక్ రవాణా వ్యవస్థ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఆర్టీసీ బస్సులు, మెట్రోలు, ఆటోలు, ర్యాపిడో వంటి బైక్ల ద్వారా ప్రజలు తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. త్వరలోనే విదేశాల్లో మాదిరిగా పాడ్ ట్యాక్సీలు అందుబాటులోకి రానున్నాయి. మెట్రో స్టేషన్లను కనెక్ట్ చేస్తూ ఈ ట్యాక్సీలు నడపనున్నారు.