హైదరాబాద్ మహానగరానికి తాగునీటిని అందించేందుకు జలమండలి కీలక చర్యలు చేపట్టింది. మే మొదటి వారం నుంచి నాగార్జునసాగర్ డెడ్ స్టోరేజీ నుంచి నీటిని పంపింగ్ ద్వారా తీసుకునేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం నీటి మట్టం 514.5 అడుగులుగా ఉండగా.. మరో నాలుగు అడుగులు తగ్గితే పంపింగ్ అవసరం అవుతుంది. అధికారులు టెండర్లు పూర్తిచేసి అదనపు పంపులు ఏర్పాటు చేశారు. రోజుకు 270 ఎంజీడీల నీరు నగరానికి సరఫరా చేయనున్నారు.