వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు షాక్ తగిలింది. బ్రహ్మనాయుడుపై తాజాగా మరో కేసు నమోదైంది. గండిపేట కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేయటంతో బ్రహ్మనాయుడు జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం అనుమతి లేకుండా నరసరావుపేట నుంచి వినుకొండ వరకూ ర్యాలీ నిర్వహించారంటూ వినుకొండ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. బ్రహ్మనాయుడు ర్యాలీ కారణంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తినట్లు పేర్కొన్నారు.