హైదరాబాద్లో ఆదివారం రాత్రి దారుణం చోటుకుంది. ఫలక్నామాకు చెందిన రౌడీషీటర్ మాస్యుద్ధీన్ గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. రెయిన్ బజార్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకోగా.. స్పాట్లోనే అతడు ప్రాణాలు కోల్పోయాడు. బాధకరమైన విషయం ఏంటంటే.. మూడ్రోజుల క్రితమే అతడి వివాహం జరిగింది. దీంతో అతడిని పెళ్లి చేసుకున్న యువతి జీవితం ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది.