ఆడ పిల్లలు, మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా.. వారిపై దారుణాలు మాత్రం ఆగటం లేదు. తాజాగా.. హైదరాబాద్లో ఓ యువ వైద్యురాలిని ఓ కామాంధుడు మోసం చేశాడు. పెళ్లి పేరుతో ఆమెను నమ్మించి కోరిక తీరిన తర్వాత మెుహం చాటేశాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.