హైదరాబాద్ నగరవాసులకు అలర్ట్. బయట ఫుడ్ తినేవారు జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే ఫేమస్ హోటళ్లలోనూ నాసిరకం ఫుడ్ విక్రయిస్తున్నారు. తాజాగా.. నగరంలోని ఓ ఫేమస్ హోటల్లో పాచిపోయిన బిర్యానీ వడ్డించారు. ఓ కస్టమర్ ఫుడ్ ఆర్డర్ ఇవ్వగా.. పాచిపోయిన బిర్యానీ పార్శిల్ ఇచ్చారు. దీంతో హోటల్ యజమానితో కస్టమర్ వాగ్వాదం పెట్టుకున్నారు.