నాన్వెజ్ ప్రియులకు అలర్ట్. మటన్ దుకాణాల్లో మటన్, హోటళ్లలో బిర్యానీ తినాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిందే. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో కొందరు వ్యాపారులు కాసులకు కక్కుర్తి పడి కుళ్లిపోయిన మాంసాన్ని హోటల్స్, ఇతర శుభకార్యాలకు విక్రయిస్తున్నారు. కొందరు మటన్ వ్యాపారులు చనిపోయిన మేకల, గొర్రెల మాంసాన్ని విక్రయిస్తున్నట్లు తేలింది. కాబట్టి అలాంటివి తినే ముందు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.