హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు ప్రయాణికులకు కొత్త సమస్యను తెచ్చి పెట్టింది. ఇటీవల ఛార్జీలను పెంచి 10 శాతం రాయితీ ఇవ్వటంతో ఛార్జీలు రూ.11, 17, 37, 56, 69కి సవరించబడ్డాయి. దీంతో నగదు చెల్లించే వారికి రూ.1, రూ.2 నాణేల కొరతతో చిల్లర సమస్య తీవ్రమైంది. కార్డు, ఆన్లైన్ చెల్లింపుల వారికి ఇబ్బంది లేకున్నా.. నగదు చెల్లించే వారు ఇ్బందులు పడుతున్నారు. దీంతో ఛార్జీలను రౌండ్ ఫిగర్లకు మార్చాలని ప్రయాణికులు సూచిస్తున్నారు.