హైదరాబాద్ నాగోల్లో దారుణం చోటు చేసుకుంది. చేపల కూర కోసం జరిగిన గొడవలో దేవీరామ్ అనే యువకుడు హత్యకు గురయ్యాడు. ముగ్గురు స్నేహితులు మద్యం సేవించిన అనంతరం కూర విషయంలో వివాదం తలెత్తగా.. ఆగ్రహానికి గురైన ముఖేశ్ అనే వ్యక్తి కత్తితో దేవీరామ్పై దాడి చేయడంతో అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.