నేరాలను అరికట్టేందుకు రాచకొండ పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రౌడీషీటర్లను నేరాల నుంచి దూరం చేసి, వారిలో సామాజిక బాధ్యత పెంచేందుకు ట్రాఫిక్ నియంత్రణలో భాగస్వాములను చేస్తున్నారు. ఇది వారి ప్రవర్తనలో మార్పు తెచ్చి, మంచి పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ వినూత్న ప్రయోగం ద్వారా సమాజంలో శాంతి భద్రతలను మెరుగుపరచాలని పోలీసులు ఆశిస్తున్నారు.