హైదరాబాద్ నగరంలో శ్రీరామ నవమి శోభాయాత్ర సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఆదివారం జరిగే ఈ ఊరేగింపు కోసం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయి. సీతారాంబాగ్ టెంపుల్ నుండి హనుమాన్ వ్యాయంశాల, హనుమాన్ టేక్డి వరకు శోభాయాత్ర సాగుతుంది. ఈ మేరకు ఆయా మార్గాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు.