హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు జీహెచ్ఎంసీ మరో ముందడుగు వేసింది. నెక్లెస్ రోడ్డులోని సంజీవయ్య పార్కు నుంచి రసూల్పుర వరకు రూ.80 కోట్లతో కొత్త ఫ్లైఓవర్ నిర్మించనుంది. దీనివల్ల ప్రయాణ సమయం 20 నిమిషాలు తగ్గడంతో పాటు బేగంపేట రహదారిపై రద్దీ తగ్గుతుంది. అంతేకాకుండా రసూల్పుర చౌరస్తాలో రూ.150 కోట్లతో వై-ఫ్లైఓవర్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు.