వినాయక నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ హస్తినాపురంకు చెందిన గిరిజ కుటుంబం తమ విగ్రహానికి అలంకరించిన ఐదు తులాల బంగారాన్ని పొరపాటున తీయకుండానే నిమజ్జనం చేశారు. వెంటనే స్పందించిన మున్సిపల్ సిబ్బంది జేసీబీ సహాయంతో విగ్రహాన్ని వెలికితీసి, బంగారాన్ని తిరిగి అప్పగించారు. దీంతో ఆ కుటుంబం ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.