Ghatkesar car accident | మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏదులాబాద్ సమీపంలో జరిగిన ఈ దుర్ఘటనలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. వీకెండ్ కావడంతో ఫామ్ హౌస్లో విందు ఏర్పాటు చేసుకున్నారు. అర్ధరాత్రి వరకూ మద్యం సేవించి, రాత్రి ఒంటి గంట సమయంలో భోజనం కోసం వెళ్లి తిరిగి వస్తుండగా.. కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది.