హైదరాబాద్ శివార్లలో భారీ భూ కుంభకోణం బయటపడింది. సంఘీ ఇండస్ట్రీస్ ప్రమోటర్లు, రవి సంఘీ కుటుంబం, బినామీ కంపెనీల సాయంతో రూ.2,002 కోట్ల విలువైన 282 ఎకరాల భూమిని మళ్లించినట్లు ఆదాయపు పన్ను శాఖ గుర్తించింది. సెబీ నిబంధనలను ఉల్లంఘించి, తక్కువ ధరకు భూములను ప్రైవేట్ సంస్థల్లోకి మార్చి మైనారిటీ వాటాదారులను మోసం చేసినట్లు ఆరోపణలున్నాయి.