హైదరాబాద్లో జూన్ 2న సనత్నగర్ టిమ్స్ ఆసుపత్రి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. దీంతో గాంధీ, ఉస్మానియా, నిమ్స్ ఆసుపత్రులపై రోగుల తాకిడి తగ్గే అవకాశం ఉంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఓపీ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు ఆలోచిస్తున్నట్లు సమాచారం. మరోవైపు అల్వాల్, కొత్తపేట టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాలు కూడా త్వరలోనే పూర్తి కానున్నాయి. అత్యాధునిక సదుపాయాలతో ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందించనున్నారు.