బస్సులో ప్రయాణిస్తుండగా నిజామాబాద్కు చెందిన ప్రసాద్రావు అనే వ్యక్తి మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నాడు. ఆ ఫోన్ ద్వారానే సైబర్ నేరగాళ్లు అతని బ్యాంకు ఖాతా నుంచి రూ.6 లక్షలు కాజేశారు. కొత్త సిమ్ తీసుకున్న వెంటనే నగదు డెబిట్ అయిన మెసేజ్లు రావడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మొబైల్ పోగొట్టుకుంటే వెంటనే సిమ్, బ్యాంకు ఖాతాలు బ్లాక్ చేసుకోవాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.