హైదరాబాద్లోని కూకట్పల్లిలో ఉన్న మంజీరా మాల్ను నిర్వహిస్తున్న మంజీరా రిటైల్ హోల్డింగ్స్ నిర్వహణను స్వాధీనం చేసుకోవడానికి లులు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్స్ సమర్పించిన రిజల్యూషన్ ప్లాన్ను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) హైదరాబాద్ బెంచ్ ఆమోదించింది. మంజీరా మాల్ దివాలా ప్రక్రియలో లులూ ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్స్ సొంతమైంది. లులూ గ్రూప్ రూ. 318.42 కోట్లకు బిడ్ దాఖలు చేయగా.. రుణదాతల కమిటీ ఆమోదం తెలిపింది. గతంలో లీజుకు తీసుకున్న లులూ ఇప్పుడు మాల్కు పూర్తి యజమాని అయింది.