వాళ్లంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకు సరిపడా డబ్బులు లేకపోవడంతో అడ్డదారిలో వాటిని పొందాలని పథకం వేశారు. అందుకోసం ఓ యోగా గురువును టార్గెట్ చేశారు. ఆయన ఆశ్రమంలోకి అనారోగ్యం పేరుతో చేరిన.. ఆ ముఠాలోని ఇద్దరు మహిళలు తమ ప్లాన్లో భాగంగా యోగా గురువుపై వల విసిరారు. వారి వలపు వలకు విలవిలలాడిపోయిన ఆయన రూ.50 లక్షలు సమర్పించుకున్నాడు. ఇంకా, తమకు డబ్బులు కావాలని బెదిరించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.