ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ను నియమించింది. ప్రస్తుతం టీటీడీ ఈవోగా ఉన్న శ్యామలరావును జీఏడీ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేశారు. అలాగే రోడ్లు భవనాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కృష్ణబాబును రెవెన్యూ, ఎక్సైజ్ ముఖ్య కార్యదర్శిగా ముఖేశ్కుమార్ మీనాను, అటవీ,పర్యావరణశాఖ కార్యదర్శిగా కాంతిలాల్ దండేను బదిలీ చేశారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు.